పరీక్షలు వాయిదా
గుంటూరు : జిల్లాలో జరుగుతున్న దీక్షలు, బంద్ ల కారణంగా నాగార్జున యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరగనున్న దూరవిద్య పరీక్షలు, రెగ్యులర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 21 నుంచి 27 వరకు నాగార్జున యూనివర్శిటీలో సెలవులు ప్రకటించారు. దీంతో యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈనెల్లో జరగవలసిన పరీక్షలు వాయిదా పడినట్లు రిజిష్ట్రార్ ఎంవీఎస్ వర్మ తెలిపారు.
News Posted: 18 December, 2009
|