టీడీపీ బస్సు యాత్ర
తిరుపతి : సమైక్యాంధ్రకు మద్దతుగా కోస్తాసీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు తిరుపతిలో బస్సు యాత్ర ప్రారంభించారు. ముందుగా రుయా ఆస్పత్రి వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం శాసనసభ్యుడు ముద్దు కృష్ణమనాయుడు మాట్లాడుతూ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 'తెలంగాణ వద్దు, సమైక్యాంద్రే ముద్దు' అనే నినాదాన్ని చాటి చెబుతామన్నారు. ఈ యాత్ర 11 రోజుల పాటు సాగుతుందని ఆయన అన్నారు.
News Posted: 18 December, 2009
|