విజయవాడ : సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న స్థానిక ఎంపి లగడపాటి రాజగోపాల్ పై ఎలాంటి కేసులూ నమోదు కాలేదని జిల్లా ఇన్ చార్జి మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నిమ్స్ లో వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఆమరణ నిరాహార దీక్షా శిబిరం నుంచి రాజగోపాల్ ను తరలించిన సమయంలో తనను నిమ్స్ కు తరలించాలని లేదా స్వరాజ్య మైదానంలోనే దీక్షకు అనుమతించాలని కోరారని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంచెప్పారు.