ఎస్కేయు పరీక్షలు వాయిదా
అనంతపురం : ఈ నెల 26 నుంచి జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను నిరవధికంగా వాయిదా వేసినట్లు శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ కుసుమకుమారి మంగళవారం ప్రకటించారు. సమైక్యాంధ్ర కోసం వర్శిటీ విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలు, దీక్షలు ఉధృతమైన నేపథ్యంలో ఎబిఎ, ఎసిఎ, ఎమ్మెస్సీ సెమిస్టర్ పరీక్షలు నిరవధికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలు నిర్వహించే తేదీలను తరువాత ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు.
News Posted: 22 December, 2009
|