గుంటూరు : సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుంటూరులో దీక్ష చేపట్టిన టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ఫోన్ చేసి పరామర్శించారు. రాజకుమారి ఆరోగ్యం పరిస్థితి గురించి చంద్రబాబు ఆరా తీశారు. మంగళవారానికి నన్నపనేని దీక్ష రెండో రోజుకు చేరింది.