విద్యార్థుల దీక్ష విరమణ
విశాఖపట్నం : సమైక్యాంధ్ర కోసం కింగ్ జార్జి ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నలుగురు విద్యార్థులు మంగళవారం దీక్షను విరమించారు. విద్యార్థులు ఆరోగ్యం బాగా క్షీణించడంతో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ వారితో చర్చలు జరిపారు. విద్యార్థులకు నచ్చచెప్పి విరమింపజేశారు. అంతకు ముందు దీక్షలో ఉన్న విద్యార్థులో కడప ఎంపి జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. దీక్ష విరమించిన సందర్భంగా విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి ఉద్యమాల్లో పాల్గొనవద్దని, శాంతియుతంగా మెలగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సూచన మేరకే దీక్ష విరమిస్తున్నట్లు చెప్పారు.
News Posted: 22 December, 2009
|