విశాఖపట్నం : నగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు లెక్చరర్ ను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి బీచ్ లోని ఇసుకలో కప్పిపెట్టారు. బుధవారం ఉదయం లెక్చరర్ మృతదేహం బీచ్ లో బయటపడడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. మృతుడు శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్ సాయికుమార్ అని పోలీసులు గుర్తించారు. మంగళవారం రాత్రి సాయంత్రం అదృశ్యమయ్యారని తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ కు పోలీసులు తరలించారు. లెకర్చరర్ హత్యకు గల కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది.