'ఉమకు వైద్యం అందించండి'
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు (ఉమ)కు బలవంతంగా అయినా వైద్యం చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బుధవారం ఆదేశించింది. ఉమ దీక్ష ప్రారంభించి బుధవారానికి 11వ రోజుకు చేరింది. వైద్యసేవలను నిరాకరిస్తున్న ఉమ ఆరోగ్యం ఆందోళనకర స్థాయికి క్షీణించడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆమరణ దీక్షల ఆత్మహత్యతో సమానమని, అందుకు ఎవరినీ అనుమతించేది లేదని కమిషన్ విస్పష్టంగా పేర్కొంది. ఉమను ఆస్పత్రి మార్చాల్సి వస్తే అందుకు తప్పకుండా పరిశీలిస్తామని కమిషన్ పేర్కొంది.
News Posted: 23 December, 2009
|