వరంగల్ : తెలంగాణపై కేంద్ర హోంమంత్రి చిదంబరం బుధవారం రాత్రి చేసిన ఉపశమన ప్రకటనతో భగ్గుమన్న తెలంగాణ విద్యార్థులు గురువారం ఉదయం హన్మకొండ పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. దీనితో పిఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ పిఎస్ కు వచ్చి విద్యార్థులను శాంతపరిచేందుకు యత్నించారు.