శ్రీవారి సేవలో యడ్యూరప్ప
తిరుపతి : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం తెల్లవారు జామున కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ ప్రవేశద్వారం వద్ద యడ్యూరప్పను టిటిడి చైర్మన్ డి.కె.ఆదికేశవులు నాయుడు, ప్రత్యేకాధికారి ఎ.వి. ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. తరువాత యడ్యూరప్పను శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్ళారు.
News Posted: 28 December, 2009
|