తిరుమలలో భజగోవిందం
తిరుపతి : వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం నాడు భజన కార్యక్రమం నిర్వహించారు. భజగోవిందం కార్యక్రమంలో భాగంగా ఈ భజనలు జరిగాయి. విఠల్ రాజ్ మహరాజ్ తన బృందంతో స్వామి వారి ఆలయంలో భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి శ్రే వేంకటేశ్వర స్వామి ఆలయం పాలకమండలి చైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు, రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, టిటిడి పాలకమండలి సభ్యురాలు శ్రీమతి ఇందిరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News Posted: 28 December, 2009
|