బైక్ ప్రమాదంలో ఇద్దరు మృతి
విశాఖపట్నం : రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మంగళవారం తెల్లవారు జామున విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే నక్కపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 29 December, 2009
|