లారీ బస్సు ఢీ: 4గురు మృతి
చిత్తూరు : జిల్లాలోని పాకాల మండలం కోనపురెడ్డిపల్లి వద్ద గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో పాకాల, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బెంగళూరు నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ వోల్వో బస్సును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 31 December, 2009
|