వరంగల్ : జిల్లాలోని ఏటూరునాగారం మండలం గంగారం వద్ద ఒక పొక్లెయినర్ ను మావోయిస్టులు గురువారం తెల్లవారు జామున తగులబెట్టారు. దేవాదుల ప్రాజెక్టు కార్యాలయంలోని ఫర్నిచర్ ను కూడా దగ్ధం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలంటూ వారు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సంఘటనా స్థలంలో ఒక లేఖను వదిలిపెట్టి వెళ్ళారు.