విశాఖపట్నం : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం జరుగుతున్న జై ఆంధ్ర సమావేశాన్ని సమైక్యాంధ్ర వాదులు అడ్డుకున్నారు. సమావేశం నిర్వహిస్తున్న భవనం గేట్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సమావేశం వేదిక వద్ద ఇరు వర్గాల మధ్యా తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటిపోతున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీనితో పరిస్థితి సర్దుమణిగింది.