వరంగల్ : ప్రత్యేక తెలంగాణ కోరుతూ నిరాహార దీక్షకు దిగిన కాకతీయ వర్శిటీ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది. ఇద్దరు విద్యార్థుల ఆరోగ్యం తీవ్ర ఆందోశనకరంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. శుక్రవారం నాటికి ఈ దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎంజిఎం హాస్పిటల్ లో ఐదోరోజు దీక్ష కొనసాగిస్తున్నారు.