ఎయూతో స్టీల్ అహగాహన
విశాఖపట్నం : ఆంధ్రాయూనివర్శిటీ, విశాఖస్టీల్ ప్లాంట్ ల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ రెండు సంస్ధలు సంయుక్తంగా పరిశోధనలు, మౌలిక వసతుల కల్పనలతో పాటుగా బోధన ప్రమాణాలు మెరుగుదల వంటి అంశాలపై అంగీకారం చేసుకున్నాయి. ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి. సత్యనారాయణ, స్టీల్ ప్లాంట్ సీఎండీ పి. కె. బిష్ణోయ్ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసారు. అనతికాలంలోనే ఒప్పంద ఫలితాలు అందుబాటులోకి వస్తాయని ఇరువురు ఆశాభావం వ్యక్తం చేసారు. 80 దశాబ్దాల చరిత్ర గల ఏయూ విజ్ఞానం తమ సంస్ధకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నట్లు స్టీల్ ప్లాంట్ సీఎండీ బిష్ణోయ్ చెప్పారు. పారిశ్రామికంగా ఎన్నో విజయాలను సాధించిన విశాఖ ఉక్కుతో ఒప్పందంతో తమ విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుందని ఏయూ వీసీ సత్యనారాయణ పేర్కొన్నారు.
News Posted: 2 January, 2010
|