విశాఖపట్నం : గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ గా వి ఎన్ విష్ణు శనివారం బాధ్యతలు స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారిగా పని చేసిన సీనియర్ ఐఎఎస్ విష్ణు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) వైస్ చైర్మన్ గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన్ను జివిఎంసి కమిషనర్ గా నియమించారు. జి వి ఎం సి కమిషనర్ గా ఉన్న బి. శ్రీధర్ ను వుడా వైస్ చైర్మన్ గా బదిలీ చేసారు.