గుంటూరు : ఎంపీ మధు యాష్కీ పేరుతో న్యాయవాదులకు విడుదలైన లేఖలపై సీబీఐ విచారణ జరపాలని సీమాంధ్ర జేఏసీ నేత శామ్యూల్ డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రాంత వాసులను కించపరిచేలా తీవ్రమైన పదజాలం ఆ లేఖలో ఉందని శామ్యూల్ ఆరోపించారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రాంత వాసులను అస్యహించుకుంటున్నారని యాష్కీ పేరుతో విడుదలైన లేఖలో రాయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.