విశాఖపట్నం : నగరంలోని ఐటీ సంస్థలకు పటిష్టమైన భద్రత కల్పించాలని పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సోమవారం నిర్వహించిన బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఐటీ సంస్థల కార్యాలయాల వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. 30 యాక్టు కింద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. బంద్ పేరుతో బలవంతంగా దుకాణాలు మూయీస్తే చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ సాంబశివరావు హెచ్చరించారు.