నేతల అరెస్ట్
విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా బస్టాండ్ వద్ద ధర్నాకు దిగిన జేఏసీ నేతలను పోలీసుల అరెస్ట్ చేసారు. మాజీ మేయర్ మల్లికా బేగం, కార్పొరేటర్ అడపా శేషులు అరెస్టైన వారిలో ఉన్నారు. జేఏసీ నేతల అరెస్ట్ కు నిరసనగా మేయర్ రత్నబిందు, అనూరాధలు కృష్ణలంక స్టషన్ ఎదుట ధర్నా చేసారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నేతలను అదుపులోకి తీసుకోవడం అన్యాయమని వారు ఆరోపించారు. అనంతరం జేఏసీ నేతలు బెంజి సర్కిల్ ప్రాంతంలో మానవహారం చేపట్టారు.బంద్ కు మద్దతుగా టీడీపీ నేత ఉమ నేతృత్యంలో పాదయాత్ర జరిగింది.
News Posted: 4 January, 2010
|