కడప : పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందుతుడు మద్దెలచెరువు సూరి జైలు నుండి విడుదలై పులివెందుల చేరుకున్నారు. వందలాది మంది అభిమానులు ఆయనకు స్వాగతు పలికారు. పావురాలగుట్టలో వైఎస్ మరణించిన సంఘటనా స్థలిని ఆయన సందర్శించారు. ఆదివారం రాత్రి పులివెందులలో బస చేసారు. సోమవారం ఉదయం సూరి ఇడుపులపాయను సందర్శించి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ తో తనకు గల అనుభందాన్ని ఈ సందర్భంగా సూరి జ్ఞప్తికి తెచ్చుకున్నారు.