విశాఖలో ఆర్మీ చీఫ్
విశాఖపట్నం : భారత ఆర్మీ చీఫ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ దీపక్ కపూర్ సతీసమేతంగా విశాఖకు విచ్చేసారు. రెండు రోజుల పాటు ఆయన తూర్పు నౌకాదళాన్ని సందర్శించనున్నారు. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మరల్ అనూప్ సింగ్ తో ఆయన బేటీ అయ్యారు. ఆనంతరం ఆయన యుద్ధనౌక ఐఎన్ఎస్ జలాశ్వను సందర్శించారు. నౌకాదళ అధికారుల భార్యల సంక్షేమ సంఘ కేంద్రాన్ని దీపక్ కపూర్ సతీమణి కృతి కపూర్ సందర్శంచారు.
News Posted: 4 January, 2010
|