కిసాన్ వాణీ సలహాలు
తిరుపతి : తిరుపతి ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమయ్యే కిసాన్ వాణీ కార్యక్రమం ద్వారా రైతులకు పంట సలహాలు ఆందించాలని కలెక్టర్ వి శేషాద్రి ఆదేశించారు. జిల్లా స్థాయి మాస్ మీడియా కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎఫ్ ఎం కేంద్రం నుండి ప్రతీ మంగళవారం సాయింత్రం 7:15 గంటల నుండి 7:45 వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేయాలని సూచించారు. రైతులు తమ సందేహాలను 0877-2246605,2246606 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
News Posted: 4 January, 2010
|