నెల్లూరు : పాల సేకరణ పెంపుపై విజయా డెయిరీ దృష్టసారించింది. ఈ మేరకు పాల సేకరణను వేగవంతం చేసేందుకు పలు చర్యలు చేపట్టింది. పాలను సేకరించేందుకు సిబ్బందిని పెంచింది. సుమారు 15 మంది ఉద్యోగులను ప్రత్యేకంగా నియమించింది. పాల సేకరణ ద్వారా రైతులకు మరింతగా ఆర్ధిక పరిపుష్టత కలిగించాలని తామగ బావిస్తున్నట్లు డెయిరీ ఎండీ కృష్ణమోహన్ తెలిపారు.