ఎస్వీ మ్యూజిక్ కాలేజి గోల్డెన్ జూబ్లీ
తిరుపతి : ఎస్వీ సంగీత, నృత్య కళాశాల గోల్డోన్ జూబ్లీ ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఐవైఆర్ కృష్ణారావు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆయన కళాశాల ఆవరణలో ఉన్న త్యాగరాయ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ మృదంగ విద్వాంసుడు డాక్టర్ యెల్లా వెంకటేశ్వరరావు, టిటిడి పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి డిఇఓ డాక్టర్ నాగరాజ్, ఆర్. ప్రభావతి, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
News Posted: 5 January, 2010
|