మావో నేతపై కేసు
విశాఖపట్నం : మావోయిస్టు అగ్రనేత అజిత్ భాజీపై జిల్లా పోలీసులు కేసు నమోదు చేసారు. గూడెంకొత్తవీధి మండలంలోని గునకరాయి వద్ద జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో అజిత్ భాజీని నిందుతుడిగా పోలీసులు అభియోగం మోపారు. 2007 సంవత్సరం మే 18న జరిగిన ఈ ఘటనలో మావోయిస్టులతో పాటుగా ఒక పోలీసు కానిస్టేబుల్ కూడా మరణించాడు. ఈ కేసుకు సంబంధించి మావోయిస్ట్ అగ్రనేత కొబాడ్ గాంధీపైని ఇటీవలే ఢిల్లీని నుండి రప్పించి విచారణ సాగించగా, ప్రస్తుతం జార్ఖండ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆజిత్ భాజీని కూడా జిల్లాకు తీసుకువచ్చి విచారణ చేయాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది.
News Posted: 5 January, 2010
|