గుంటూరు : ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భారీగా బోగస్ లబ్దదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంచనాలకు మించి అనర్హలు బయటపడుతుండటం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు నిర్వహించిన సమీకృత సర్వేలో ఈ బోగస్ లు వెలుగు చూసినట్లు అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డ్ ల లబ్దిదారుల్లో అత్యధికంగా 30 శాతం మంది బోగస్ లను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.