ఆర్ధిక అధికారి దురుసు
తిరుపతి : శ్రీ పద్మవతీ మహిళా విశ్వవిద్యాలయంలో బుధవారం బోధన, బోధనేతర సిబ్బంది మధ్య రేగిన వివాదం ఆందోళనకు దారి తీసింది. వర్శిటీ ఆర్ధికాధికారి రంగప్ప, వైస్ ఛాన్సలర్ సరోజమ్మతో దురుసుగా ప్రవర్తించారు. అధ్యాపకులను నిందించడంతో వారంతా ఆందోళనకు దిగారు. దీంతో అతనిపై చర్య తీసుకోవాలని బోధన సిబ్బంది ఉన్నతాధికారులకు విన్నవించారు. దీంతో రంగప్పను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు.
News Posted: 7 January, 2010
|