వరంగల్ : జిల్లాలో పోలియో వ్యాధి నివారణకు ఈ నెల 10న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎన్ శ్రీధర్ తెలిపారు. కలెక్టర్ తన కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో నివారణ చుక్కలు వేయించాలని కోరారు.
4.50 లక్షల మంది చిన్నారులు జిల్లాలో ఉన్నారని వారందరికీ చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.