వైభవంగా మెట్ల ఉత్సవం
తిరుపతి : శ్రీ వారి ఆలయంలో త్రైమాసిక మెట్లోత్సవం ఆంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం, దశ ప్రాజెక్ట్ సంయుక్తంగా కలసి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. దక్షిణ భారతదేశానికి చెందిన పులువురు భక్తులు, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు ప్రత్యేక దుస్తుల అలంకరణతో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రతీ ఏటా ఈ మెట్ల ఉత్సవాన్ని వారు అత్యంత అనందోత్సాహలతో జరుపుకుంటారు.గోవిందరాజుల అలయం నుండి భక్తి గీతాల ఆలపిస్తూ ప్రార్థనలు చేసారు. ఈ కార్యక్రమానికి టిటిడి ఈఓ కృష్ణరావు, దశ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఆనంద తీర్థాచార్యలు పాల్గోన్నారు.
News Posted: 8 January, 2010
|