అక్రమ చొరబాటు
గుంటూరు : భారత సముద్ర జలాల్లోకి ఆక్రమంగా ప్రవేశించిన శ్రీలంక జాలర్లను నిజాంపట్నం పోలీసులు అరెస్ట్ చేసారు. తీరప్రాంతంలో విదేశాలకు చెందిన 17 బోట్లు చొరబడ్డాయని, వారు తీవ్రవాదులై ఉంటారని ప్రచారం సాగింది. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ బాగ్సీ మెరైన్, కోస్టుగార్డులను ఆప్రమత్తం చేసారు. తీరంలో గాలించగా శ్రీలంకకు చెందిస అధునాతన బోటు పోలీసు బృందాలకు చిక్కింది. ఈ బోట్ లో ఉన్న శ్రీలంకకు చెందిన ఆరుగురు జాలార్లును పోలీసులు అరెస్ట్ చేసారు.
News Posted: 9 January, 2010
|