విజయవాడ : నగరంలోని దుర్గగుడి ఆలయం సమీపంలోని టోల్ గేట్ వద్ద భారీ పైప్ లైన్ పగిలింది. దీంతో రోడ్డు పైకి నీటి ప్రవావం చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు కిలోమీటర్ పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని తగ్గించేందుకు ట్రాపిక్ ను సొరంగం మీదుగా మళ్లించారు. అయితే పోలీసులు మాత్రం ఈ సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.