పుట్టపర్తి : సత్యసాయి నిలయంలోని ఈండోర్ స్డేడియంలో స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. భగవాన్ సత్యసాయి సోమవారం ఉదయం లాంఛనంగా ఈ క్రీడోత్సవాన్ని ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు బాబా స్టేడియం ప్రాంగణానికి చేరుకోగానే విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ తో స్వాగతం పలికారు. బృందావన్ క్యాంపస్ విద్యార్ధులు ప్రతీ ఏటా జనవరి 11 న స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. సత్యసాయి అవతార క్రీడతో వేడుకలను విద్యార్ధులు ప్రారంభించారు.