గుంటూరు : గుంటూరు నగరాన్ని మహా గుంటూరుగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. నగర శివారు ప్రాంతాలు కొన్నింటిని నగరంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటన్నట్లు మంత్రి మాణిక్య వరప్రసాద్ తెలిపారు. అలాగే నగరానికి ఆనుకోని ఉన్న దాచేపల్లి ని కూడా నగరంలో విలీనం చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలను పరిశీలిస్తోందని చెప్పారు.