విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ల లోని ఎన్ ఎమ్ ఎస్ విభాగంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. సోమవారం ఉదయం ఎన్ ఎమ్ ఎస్ విభాగంలో సిలిండర్ పేలింది. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కార్మికుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.