నాట్య మహోత్సవాలు
విజయవాడ : జిల్లాలో కూచిపూడిలో శ్రీ సిద్దేంద్ర యోగి నాట్యమహోత్సవాలు నిర్వహించనున్నారు. మూడు రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలు సిద్దేంద్ర యోగి జన్మదినమైన జనవరి 26న ప్రారంభించేందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఉత్సవాలకు వేదిక కానున్న సిద్దేంద్ర యోగి కూచిపూడి నాట్య కళా పీఠాన్ని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి చెల్లప్ప సందర్శించారు. 100 మంది కళాకారులతో ఒకే వేదికపై నాట్యోత్సనం జరుగుతుందని, ముఖ్యమంత్రి కూడా ఈ ఉత్సవాలకు హాజరవుతారని ఆయన చెప్పారు.
News Posted: 12 January, 2010
|