కోడిపందేలుపై కేసులు
విజయవాడ : సంక్రాంతి పండగ సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏలూరు రేంజి డీఐజీ మహేశ్ హెచ్చరించారు. పందేలు నిర్వాహకులపై రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరికలు జారీ చేసారు. ఏలూరు రేంజి పరిధిలో పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో ఇంటెలిజెన్స్, పోలీలు ఉన్నతాధికారులు మఫ్టీలో సమాచారాన్ని సేకరించి పందేలు జరగకుండా కట్టడి చేయాలని నిర్ణయించారు.
News Posted: 12 January, 2010
|