ఏలేరులో రసాయనాలు
విశాఖపట్నం : ఏలేరు కాలువలో ప్రమాదకర రసాయనాలు కలిసిసట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం కణితి సంతులన జలాశయం (కెబిఎస్ )లో భారీ సంఖ్యలో చేపలు చనిపోవడానికి ఈ కలుషిత నీరే కారణమని ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ మేరకు కెబిఎస్ లో 200 మీటర్ ల ప్రాంతాన్ని తనిఖీ చేయగా రసాయనాల ఆనవాళ్లు కనిపించినట్టు అధికారులు ధృవీకరించారు. కలెక్టర్ శ్యమలరావు ఈ సంఘటనను తీవ్రంగా పరింణిస్తున్నట్లు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు జీవీఎంసీ, పోలీసు, నీటిపారుదల శాఖ అధికారులు సమాంతరంగా దర్యాప్తు సాగిస్తున్నారు.
News Posted: 13 January, 2010
|