తిరుపతి : జవహార్ లాల్ నెహ్రూ జాతీయ పట్టణాభివృద్ది పథకం (జేఎన్ ఎన్ యూఆర్ఎం) కింద నగరంలోని వ్యర్ధ పదార్థాల శుద్ధికి జర్మనీకి చెందిన జీటీజడ్ సహకారం తీసుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జర్మన్ టెక్నికల్ కో ఆపరేషన్ బృందం నగరానికి చేరుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు కార్పొరేషన్ కమిషనర్ మోహన రెడ్డితో సమావేశమయ్యారు. నగర పారిశుధ్య అభివృద్దిపై చర్చించారు.