రచ్చకెక్కిన విభేదాలు
విశాఖపట్నం : కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు రోజూరోజుకు మరింతగా ముదురుతున్నాయి. మహా విశాఖ నగర పాలర సంస్థ పాలకవర్గ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. ఎంపీ సబ్బం హరి తీరుపై ఈస్ట్ నియెజకవర్గ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హరి తీరు కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటోందని ఆయన ఆరోపించారు. తాము కేవలం ఫ్లోర్ లీడర్ మార్పు కోసం ప్రతిపాదించామని, ఈ మేరకు మంత్రి పురంధేశ్వరి, జిల్లా మంత్రి బాలరాజులతో ఈ నెల 24న సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. అయితే ఫ్లోర్ లీడర్, మేయర్ , డిప్యూటీ మేయర్ మార్పులు చేస్తామంటూ హరి ప్రకటనలతో తప్పుదొవ పట్టించి పార్టీలో సంక్షోభానికి కారణమవుతున్నారని మండిపడ్డారు. పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేస్తున్న తనను బలి పశువును చేసే యత్నం సాగుతోందని విజయ్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేసారు.
News Posted: 15 January, 2010
|