ముంచిన అకాల వర్షం
గుంటూరు : ఆరుగాలం శ్రమించిన అన్నదాతను అకాల వర్షం నిలువునా ముంచింది. పండిన మిర్చీ ధర ఆశాజనకంగా ఉందని ఉత్సాహంతో ఉన్న రైతన్నను ఊహించని వాన చిదిమేసింది. శుక్రవారం రాత్రి జిల్లాలోని సత్తెనపల్లి, కంటెపూడి, గుడిపూడి, పాకాలపాడు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో కళ్లాళ్లో వేసిన మిర్చీ కుప్పలు నీట మునిగాయి. పండిన పంట నీళ్ల పాలు కావడంతో రైతు లబోదిబోమంటున్నారు.
News Posted: 15 January, 2010
|