వై ఎస్ స్మారక పార్కు
విజయవాడ : దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జ్జ్ఞాపకార్థం గన్నవరం సమీపంలో స్మారక పార్కు, స్థూపాన్ని నెలకొల్పేందుకు వీజీటీఎం ఉడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు అనువైన స్దలాన్ని గుర్తించేందుకు జాయింట్ కలెక్టర్ బీ రామయ్య, ఉడా వైస్ చైర్మన్ విఠల్ గన్నవరంలో పర్యటించారు. ఈ పార్కు నిర్మాణం కోసం ఐదు ఎకరాల స్థలం అవసరం కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
News Posted: 18 January, 2010
|