తితిదే ఈఓ పెరూర్ సందర్శన
తిరుపతి : పేరూర్ లోని వకుల మాతాదేవి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ ఐ. వై. ఆర్ కృష్ణారావు సోమవారం సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆలయనిర్మాణానికి కోటి 20 లక్షల రూపాయలు వ్యయం చేస్తున్నట్లు వెల్లడించారు. ఏడాది కాలంలో మొత్తం నిర్మాణ పనులను పూర్తి చేస్నామని ఆయన చెప్పారు. నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించినట్లు చెప్పారు.
News Posted: 18 January, 2010
|