25న డీఆర్సీ సమావేశం
విశాఖపట్నం : జిల్లా సమీక్షా మండలి సమావేశం ఈ నెల 25న విర్వహిస్తున్నారు. నగరంలోని పోలీసు బ్యారెక్స్ సమీపంలోని వైశాఖి జల ఉద్యానవనంలో ఉదయం 11 గంటలకు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అద్యక్షతన సమావేశం జరగనుంది. గత ఏడాది సెప్టెంబర్ ఒకటిన డీఆర్సీ సమావేశం నిర్వహించారు. అదే నెలలో కరువు పరిస్థితిపై ప్రత్యేక డీఆర్సీ ఏర్పాటు చేసారు. గత నెల 13 న సమావేశం కావాలనుకున్నా, అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 25న నిర్వహించాలని నిర్ణయించారు. సభ్యులంతా హాజరుకావాలని సీపీఓ శివరాం నాయకర్ కోరారు.
News Posted: 19 January, 2010
|