పొన్నాల ఇళ్లు ముట్టడి
వరంగల్ : మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని విద్యార్ధులు బుధవారం ముట్టడించారు. తెలంగాణకు మద్దతుగా ఆయన తన పదవికి రాజీనామా చేయాలంటూ తెలంగాణ జేఏసీ విద్యార్థులు పొన్నాల ఇంటి ముందు బైఠాయించారు. తెలంగాణ పట్ల మంత్రి వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. తెలంగాణకు మద్దతుగా మంత్రి తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేసారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్ధులను చెదరగొట్టారు. పులువురుని అదుపులోకి తీసుకున్నారు.
అలాగే మాజీ మంత్రి కొండా సురేఖ ఇంటిని కూడా జేఏసీ విద్యార్దులు చుట్టిముట్టారు. తెలంగాణ పట్ల సురేఖ వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. తెలంగాణకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. విద్యార్థి నాయకరాలుతో సురేఖ ఫోన్ లో మాట్లాడుతూ, తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నానని అమె వివరించారు.
News Posted: 20 January, 2010
|