విజయవాడ : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి చాముండేశ్వరీ నాధ్ బుదవారం కోర్టుకు హాజరయ్యారు. మహిళా క్రికెటర్ ల వేధింపుల ఆరోపణలపై కోర్టులో కేసు నడుస్తోంది. కేసు వాయిదాలో భాగంగా కోర్టుకు వచ్చిన చాముండీని పలు మహిళా సంఘాలకు చెందిన ప్రతినిధులు అడ్డుకున్నారు. ఆయన కారును అడ్డగించి నిరసన తెలిపారు. అయితే కేసు విచారణను కోర్టు వచ్చే నెల 17 తేదీకి వాయిదా వేసింది.