ఇద్దరు మావోయిస్టులపై కేసు
విశాఖపట్నం : జిల్లాలోని గునకరాయి ఎన్ కౌంటర్ వ్యవహారంలో తాజాగా మరో ఇద్దరు మావోయిస్టులపై కేసు నమోదైంది. 2008 జూన్ 28న గునకరాయిలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులతో పాటుగా అనిల్ కుమార్ అనే మరో గ్రేహౌండ్స్ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించి ఇప్పిటికే మావోయిస్టు అగ్రనేత కోబాడ్ గాంధీపై పోలీసులు కేసు నమోదు చేసారు. తాజాగా ఒరిస్సాకు చెందిన శర్మ, అజిత్ భాజీ అనే మరో ఇద్దరు మావోయిస్టు నేతలపైనా కేసు నమోదు చేసారు. ఒరిస్సాలో అరెస్ట్ చేసిన వీరిని చింతపల్లి కోర్టులోహజరుపరిచారు.
News Posted: 20 January, 2010
|