తిరుపతి : దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరిట మహిళా ప్రాంగణాలను నిర్మించాలని తుడా నిర్ణయించింది. జిల్లాలోని తుడా పరిధిలోని160 పంచాయతీల్లో ఈ భవనాల నిర్మాణం చేపట్టాలని తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయా పంచాయతీల్లో స్థలాలను ఎంపిక చేయాలని ఆయన వైస్ చైర్మన్ పెంచల్ రెడ్డిని కోరారు.