కెజిహెచ్ లో ఆందోళన
విశాఖపట్నం : విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న ఆయాపై డాక్టర్ చేయి చేసుకున్న సంఘటన ఆందోళనకు దారితీసింది. ఆపరేషన్ ధియేటర్ ఆవరణలో పరిసరాలను శుభ్రం చేస్తున్న ఆయా అరుణపై డాక్టర్ గిరిధర్ దాడి చేశారు. డాక్టర్ వైఖిరికి నిరసనగా నాలుగో తరగతి ఉద్యోగులు సూపరిండెంట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ ధియేటర్ లు, ఇతర విధులు బహిష్కరించి అంతా మెరుపు సమ్మె చేయడంతో శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి.
News Posted: 21 January, 2010
|